జాతీయ వార్తలు

ప్రజల మదిలోని మాట వింటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దెదియాపడా (గుజరాత్), మే 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించాల్సిన మోదీ తాను చెప్పే మాటలను ప్రజలు వినేలా చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగాల్సిన గుజరాత్‌లో ఆయన కాంగ్రెస్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ అవుతుందన్నారు. నర్మద జిల్లాలోని దెదియాపడాలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో పోరాడి మోదీ సొంత రాష్ట్రంలో బిజెపిని మట్టికరిపించడం ఖాయమని చెప్పారు.
‘గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే మా ప్రభుత్వం ఏ ఒక్కరి కోసమో కాకుండా అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందని, మా మనసులోని మాటను ప్రజలకు చెప్పడానికే పరిమితం కాకుండా ప్రజల మనసులోని మాటను వినేందుకు మేము ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నా’ అని రాహుల్ స్పష్టం చేస్తూ, పరోక్షంగా మోదీ ‘మన్ కీ బాత్’ ప్రసంగాలపై విమర్శలు సంధించారు.

చిత్రం..గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు వచ్చిన రాహుల్‌కు గజమాలతో స్వాగతం