జాతీయ వార్తలు

12నుంచి ప్రధాని శ్రీలంక పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంక వెళ్లనున్నారు. అక్కడ జరిగే అంతర్జాతీయ బుద్ధిస్ట్ ఫెస్టివల్‌లో మోదీ పాల్గొంటారు. రాజధాని కొలంబోలో ఈ నెల 12 నుంచి 14 వరకూ అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. వంద దేశాల నుంచి 4వేల మందికి పైగా ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. బౌద్ధులకు వేసక్ ఓ పవిత్ర దినం. బుద్ధుని జయంతి సందర్భంగా ఈ వేడుకలు పెద్దఎత్తున జరుపుతారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఎలాంటి అధికారిక చర్చలు ఉండవని విదేశాంగ శాఖ (హిందూ మహాసముద్ర ప్రాంత) కార్యదర్శి సంజయ్ పాండా వెల్లడించారు. లంక నాయకులను మోదీ మర్యాదపూర్వకంగా కలుస్తారని ఆయన అన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీలంకలో పర్యటించడం ఇది రెండోసారి.