జాతీయ వార్తలు
పెళ్లిహాలు గోడకూలి 24 మంది దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జైపూర్, మే 11: రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో మ్యారేజ్ హాల్ గోడ కూలి 24 మంది దుర్మరణం చెందారు. బుధవారం నాడు జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. భరత్పూర్లోన సేవర్రోడ్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలకు నానిపోయిన 12 అడుగుల ఎత్తయిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సమయంలో పెళ్లి జరుగుతోంది. పెళ్లికొచ్చిన అతిథులపై గోడ కూలిపోయింది. కాగా కళ్యాణ మండపానికి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేదు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి కాళీచరణ్ సరాఫ్ సంఘటనపై విచారణకు ఆదేశించారు. విడివిడిగా మూడు కమిటీలను ఏర్పాటు చేసిన విచారణ చేయిస్తున్నట్టు గురువారం మీడియాకు తెలిపారు. ఏడు రోజుల్లో కమిటీలు నివేదికను అందజేస్తాయి. ఒక కమిటీ ప్రమాదంపై విచారణ జరుపుతుంది. రెండో కమిటీ మ్యారేజ్ హాళ్లలో భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా లేవా అనే దానిపై విచారణ జరుపుతుంది. మూడో కమిటీ బాధితులకు సకాలంలో వైద్యం అందిందా లేదా అన్నదానిపై విచారణ జరుపుతుంది. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వసుందరరాజె, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండేసి లక్షలు రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేల ఆర్థిక సహాయం ఇస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ఆర్థిక సహాయంగా ప్రకటించింది. మండపం యజమాని పరారీలో ఉన్నాడు.
చిత్రం..గోడ కూలిపోయన చోట గుమికూడిన జనం