జాతీయ వార్తలు

రెండు బస్సు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవాడ/గోపాల్‌గంజ్, మే 15: బిహార్‌లోని నవాడ, గోపాల్‌గంజ్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందగా, 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. నవాడా జిల్లాలో ఇటుక బట్టీ కార్మికులతో కిక్కిరిసి ఉన్న ఓ బస్సు అదుపు తప్పడంతో అందులో ప్రయాణిస్తున్నవారిలో ఐదుగురు మృతిచెందగా, 50 మంది కార్మికులు గాయపడ్డారు. మరణించినవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని పాట్నా మెడికల్ కాలేజీకి తరలించారు. గోపాల్‌గంజ్ జిల్లాలో పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.