జాతీయ వార్తలు

ఆ కథనాలు ఊహాగానాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 15: కోల్‌కతాలోని సిండికేట్ బ్యాంక్‌లో 800 కోట్ల రూపాయల డిపాజిట్ అయిన విషయాన్ని తెలుసుకుని ఆదాయ పన్ను శాఖ ఆశ్చర్యపోయింది. ఈ డిపాజిట్లకు సంబంధించిన మూలాలు విశాఖలో కూడా ఉన్నాయి. విశాఖలోని ఆదాయపన్ను శాఖ అధికారులు కూడా వెంటనే మేల్కొని ఇందుకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఇది మనీ లాండరింగ్ అని భావించిన తాము ముందుగా ఎంవిపి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ తెలియచేశారు. సోమవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసును 11వ తేదీన నమోదు చేశామని, 12వ తేదీన ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక వివరాలు డిజిపి సాంబశివరావుకు తెలియచేస్తూ లేఖ రాశామని ఆయన చెప్పారు. నగర భద్రత, బందోబస్త్ తదితర బాధ్యతల నేపథ్యంలో ఈ కేసును తాము దర్యాప్తు చేయలేమని, సిఐడిలోని ఆర్థిక నేర పరిశోధన విభాగానికి అప్పగించమని కోరినట్టు యోగానంద్ వివరించారు.