జాతీయ వార్తలు

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం, హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, మే 2: న్యాయ శాస్త్రాన్ని అభ్యసిస్తున్న 30 ఏళ్ల దళిత యువతిపై ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలో అత్యాచారం, దారుణ హత్య జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం నివేదికలో ఈ విష యం వెల్లడైంది. కేరళలోని పెరుంబవూర్‌కు సమీపాన సదరు యువతి నివాసంలో గత నెల 28వ తేదీన ఈ దారుణం జరిగింది. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ నిందితులను పట్టుకునేందుకు యుడిఎఫ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియెరి బాలకృష్ణన్ ధ్వజమెత్తారు. అయితే ఈ ఆరోపణను రాష్ట్ర హోం శాఖ మంత్రి రమేష్ చెన్నితల తోసిపుచ్చారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు జరుగుతోందని, దోషులను శిక్షించి తీరుతామని చెప్పారు.