జాతీయ వార్తలు

రైతు ఉద్యమాలపై జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: రైతుల నిరసనలకు సంబంధించి పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మధ్యప్రదేశ్‌కు ఇరుగు పొరుగున ఉన్న రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఆందోళనలకు దిగిన రైతులపై జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు మరణించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక చేసింది. రైతుల ఆందోళనకు సంబంధించి ఎలాంటి సంకేతాలు అందినా గట్టి చర్యలు తీసుకోవాలంటూ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్టల్రకు కేంద్రం స్పష్టం చేసింది. తమ డిమాండ్లను ఆమోదించని పక్షంలో తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామంటూ ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్‌లకు చెందిన పలు రైతు సంఘాలు హెచ్చరించాయి.