జాతీయ వార్తలు

మానస సరోవర యాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: హిందువులకు పరమ పవిత్రమైన కైలాస మానస సరోవర యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది ఈ యాత్రకు బయలుదేరిన మొదటి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ భవన్‌లో జెండా ఊపి వారిని ముందుకు సాగనంపారు. కైలాస మానస సరోవర యాత్ర సందర్భంగా భక్తులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, యాత్రామార్గాన్ని మలినం చేయరాదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ఏడాది మొత్తం 1,430 మంది భక్తులు 60 మంది చొప్పున 25 బృందాలుగా ఈ యాత్రను చేపట్టనున్నారు. వీటిలో 18 బృందాలు లిపులెఖ్ పాస్ మార్గం ద్వారానూ, మిగిలిన 7 బృందాలు కొత్తగా ప్రారంభించిన నాథూలా మార్గం ద్వారాను కైలాస మానస సరోవరాన్ని సందర్శించనున్నాయి.