జాతీయ వార్తలు

రెండాకుల గుర్తు మాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: విలీన వ్యవహారం అటకెక్కడంతో అన్నాడిఎంకె వైరి వర్గాల మధ్య మళ్లీ సమరం మొదలైంది. అసలు అన్నాడిఎంకె తమదేనని, తమకే అధికారిక రెండాకుల గుర్తు దక్కాలంటూ మాజీ ముఖ్యమంత్రి పనీర్‌సెల్వం గ్రూపు గురువారం ఎన్నికల కమిషన్‌కు రెండు వాహనాల్లో తెచ్చిన అఫిడవిట్లను సమర్పించింది. నాలుగు రోజుల క్రితమే శశికళ వర్గం నాలుగు లారీల్లో తెచ్చిన అఫిడవిట్లను ఈసీకి అందించిన నేపథ్యంలో పనీర్ వర్గం తాజా ప్రయత్నం చేసింది. రెండు వర్గాలూ కూడా అధికార అన్నాడిఎంకె గుర్తు తమదేనని రుజువు చేసుకునేందుకే ఈసీకి అఫిడవిట్లను ఓ పరంపరగా అందిస్తున్నాయి. రెండాకుల గుర్తు తమకే దక్కాలని రుజువు చేసే ఆధారాలను అందించాలంటూ ఇరు వర్గాలకు ఈసీ విధించిన గడువు సమీపించడంతో అఫిడవిట్ల దాఖలు ఊపందుకుంది. తాజాగా పనీర్ వర్గం లక్షా 80వేల అఫిడవిట్లను తమ వాదనకు మద్దతుగా ఈసీకి సమర్పించినట్టు చెబుతున్నారు.