జాతీయ వార్తలు

రాష్టప్రతి ఎన్నికలో ఎమ్మెల్యేకు ఒకే ఓటు విలువ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 16: రాష్టప్రతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల శాసన సభలలోని ఒక్క ఎమ్మెల్యేకు ఒకే ఓటు విలువ కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ లేఖ రాశారు. ఏపీ విభజన తర్వాత మొదటి సారిగా జరగుతున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యే ఓటు విలువ మార్పు లేకుండా సమానంగా ఉండే విధంగా చర్యలు తీసుకొవాలని ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
రాష్టప్రతి ఎన్నికల్లో తెలంగాణ ఎమ్మెల్యేకు ఓటు విలువ తక్కువగా ఉండటంపై వినోద్ లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే ఓటు విలువతో పోలిస్తే,తెలంగాణకు చెందన ఎమ్మెల్యేకు ఓటు విలువ తక్కువగా ఉందని,ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి 159,తెలంగాణకు 132గా ఎమ్మెల్యేలకు ఓటు విలువగా నిర్థారించారు.దీనిపై రాష్టప్రతి ఎన్నికల ముందే రాజ్యాంగ సవరణ చేస్తే మంచిదని ఆయన వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకుండా రాజ్యాంగలోని ఆర్టికల్ 55(2)ను సవరించాల్సిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.