జాతీయ వార్తలు

ప్రధాని మోదీ నోట విజయనగరం మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో 100 గంటల్లో 71 గ్రామాల్లో 10వేల మరుగుదొడ్లు నిర్మించడంపట్ల ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆదివారం రేడియోలో 33వ ‘మన్ కీ బాత్’లో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా విజయనగరం జిల్లాలో స్థానిక ప్రజలను అధికారులు చైతన్యవంతం చేసి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. మార్చి 10వ తేదీ ఉదయం ఆరు గంటలనుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు 100 గంటల్లో నిర్విరామంగా 10వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశారని మోదీ వెల్లడించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి 71 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ప్రజలు, అధికారులు, స్థానిక నాయకులను ప్రధాని అభినందించారు. ప్రజల్లో ప్రేరణ తీసుకురావడానికి ఈ ఘటన మంచి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.