జాతీయ వార్తలు

పోలవరం పిటిషన్‌ను విచారిస్తాం: ఎన్జీటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జున్ 3: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ ఎన్జీటిలో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ విచారించింది.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలైనందు వల్ల ఎన్జీటీలో విచారణ అవసరం లేదని గతంలో రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.అయితే పోలవరం పర్యావరణ అనుమతుల విషయంలోఒక్క పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు కాలేదని ఈ పిటిషన్ విచారించాలని పిటిషనర్ల్ తరపు న్యాయవాది వాదించారు.పోలవరం పర్యావరణ అనుమతుల విషయంలో విచారణ జరుపుతామని ట్రిబ్యునల్ తెలిపింది. ఈ పిటిషన్ తుది వాదనలు వింటామని పేర్కొంటూ తదుపరి విచారణను ఆగష్టు 3 తేదీకి వాయిదా వేసింది.