జాతీయ వార్తలు

మత ఘర్షణలపై న్యాయ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 8: ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బదూరియా, బాసిర్‌హత్ ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై న్యావిచారణకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు, మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుయుక్తులు పన్నుతోందని ఆమె ఆరోపించారు. దేశ సమైఖ్యతకు విఘాతం కలిగేలా ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలో చొరబాట్లకు ఊతాన్నిచ్చి ఇక్కడ అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. జిల్లా ఎస్పీని బదిలీ చేయడమే కాకుండా ముగ్గురు బిజెపి ఎంపీలతోకూడిన బృందాన్ని జిల్లాలో పర్యటించకుండా నిషేధించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.