జాతీయ వార్తలు

అవి నకిలీవే: ఆప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఇక్కడ విడుదల చేసిన మోదీ డిగ్రీ పట్టాలు నకిలీవని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బిజెపి నేతల విలేఖరుల సమావేశం అయిన గంట తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ మీడియాతో మాట్లాడారు. మార్కుల షీట్‌పై నరేంద్ర కుమార్ దామోదర్ దాస్ మోదీ అని రాసి ఉంటే డిగ్రీ సర్ట్ఫికెట్‌పై నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని ఎందుకు ఉందని నిలదీశారు. మార్కుల షీట్‌పై ఉన్న తేదీలో 1977 సంవత్సరం అని ఉంటే డిగ్రీని 1978లో ఎందుకు ఇచ్చారని ఆప్ నేత ప్రశ్నించారు. అమిత్ షా, అరుణ్ జైట్లీ విడుదల చేసిన సర్ట్ఫికెట్లు ముమ్మాటికీ నకిలీవేనని ఆయన వాదించారు. అలాగే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే పేరున్న వారెవ్వరు కూడా 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పాస్ కాలేదని, నరేంద్ర మహావీర్ మోదీ అనే విద్యార్థి మాత్రం రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారని అశుతోష్ వెల్లడించారు. సర్ట్ఫికెట్లలో ఇంటిపేరును కూడా మార్చేసి బిజెపి నేతలు విడుదల చేశారని ఆప్ నేత దిలీప్‌పాండే విమర్శించారు.