అంతర్జాతీయం

పాకిస్తాన్‌లో తాలిబన్ల పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్, జూలై 17: పాకిస్తాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. వాయువ్య ప్రాంతంలో పారా మిలటరీ సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనంపై సోమవారం ఒక ఆత్మాహుతి బాంబర్ దాడికి తెగబడి సైనిక అధికారి సహా ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ దాడిలో మరో పది మంది గాయపడ్డారు. పెషావర్‌లోని హయతాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ ఏరియాలో ఒక ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్ధాలు అమర్చిన మోటార్ సైకిల్‌తో ఫ్రాంటియర్ కాన్‌స్టాబ్యులరీ (ఎఫ్‌సి) కాన్వాయ్‌ని ఢీకొన్నాడని, ఈ దాడిలో మేజర్ సహా ఇద్దరు ఎఫ్‌సి సిబ్బంది మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. హయతాబాద్‌లోని బాగ్ ఎ నరాన్ చౌక్ వద్ద జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో రెండు సైనిక వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వారు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారని, క్షతగాత్రులను హయతాబాద్ మెడికల్ కాంప్లెక్స్‌కు తరలించారని పోలీసులు తెలిపారు.