జాతీయ వార్తలు

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ విప్‌గా మరోసారి ఎంఏ ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ మరోసారి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ విప్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ నియామకం చేసినట్లు రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. ఏంఏ ఖాన్ నాలుగేళ్ల నుండి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ విప్‌గా పనిచేస్తున్నారు. ఆయన పదవీకాలం సోమవారంతో ముగిసింది. దీనితో ఆయనను మరోసారి నాలుగేళ్లకోసం పార్టీ విప్‌గా నియమించారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కిశోర్ చంద్రదేశ్‌ను ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించి పార్టీ గిరిజన వ్యవహారాల బాధ్యతను అప్పగించారు. దాంతోపాటు ఆంధ్ర, తెలంగాణ, ఒడిశాల్లో కాంగ్రెస్‌ను పునరుద్ధరించే బాధ్యతలు కూడా అప్పగించనున్నట్లు ఏఐసిసి వర్గాలు తెలిపాయి.