జాతీయ వార్తలు
కొత్త రాష్టప్రతి కార్యదర్శిగా కొఠారి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూలై 22: కొత్త రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్ కార్యదర్శిగా సంజయ్ కొఠారి నియమితులయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్గా సంజయ్ ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్టు అశోక్ మాలిక్ను కోవింద్ ప్రెస్ కార్యదర్శిగా నియమిస్తారు, ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. నూతన రాష్టప్రతి కోవింద్ వద్ద జాయింట్ సెక్రెటరీగా గుజరాత్ కేడర్ సీనియర్ ఫారెస్టు అధికారి భరత్లాల్ను నియమించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గల కేబినెట్ నియామకాల కమిటీ కొత్త నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామకాలు రెండేళ్లపాటు అమల్లో ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కొఠారి 1978 బ్యాచ్ హర్యానా కేడర్ ఐఎఎస్ అధికారి. గత ఏడాది జూన్లో ఆయన పదవీ విరమణ చేశారు. 2016 నవంబర్లో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. మాలిక్ విధాన నిర్ణాయక కమిటీ పరిశీలకునిగా సేవలందిస్తున్నారు. భరత్లాల్ 1988 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో గుజరాత్ ప్రభుత్వ రెసిడెన్స్ కమిషనర్గా పనిచేస్తున్నారు.