జాతీయ వార్తలు

అమరావతిపై పిటిషన్ జూలైకి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులపై ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్ల తదుపరి విచారణ జూలై 11వ తేదీకి వాయిదా పడింది. మంగళవారం నూతన రాజధాని నిర్మాణంపై దాఖలైన పిటిషన్లు జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ శ్రీమన్నారాయణ తరపు న్యాయవాది సంజయ్ పారిక్ వాదనలు వినిపించారు. వరద ప్రభావిత ప్రాంతలను గ్రీన్ ట్రిబ్యునల్ అధ్వర్యంలో వివిధ రంగాల నిపుణుల కమిటీ చేత గుర్తించాలని ట్రిబ్యునల్ కోరారు. ఇప్పటికే వరద, చిత్తడి నేలలను గుర్తించారని, నిపుణుల కమిటీ వేశామని ఏపీ తరపు న్యాయవాది ఎకె గంగూలీ ట్రిబ్యునల్‌కు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చిత్తడి నేలలు, వరద ప్రాంతాన్ని, నీటి వనరులు ఉన్న ప్రాంతాలను గుర్తించిన వాటిని తెలియజేస్తూ మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 11 తేదీకి ట్రిబ్యునల్ వాయిదా వేసింది.