జాతీయ వార్తలు

లష్కరే కమాండర్ దుజానా హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 1: కాశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రదాడులతో సంబంధం ఉన్న లష్కర్ ఏ తోయిబా కమాండర్ అబు దుజానా మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అతడితో పాటు అతని అనుచరుణ్ని కూడా భద్రతాదళాలు పుల్వామా జిల్లాలోని హక్రిపోరాలో కాల్చి చంపాయి. సోమవారం రాత్రి నుంచి దుజానా కదలికలపై సమాచారం అందటంతో ఆ ప్రాంతాన్ని భద్రతాదళాలు దిగ్బంధించాయి. ఈ ప్రాంతంలో నక్కిన మిలిటెంట్లపై మంగళవారం తెల్లవారుజామునుంచే ఎదురుకాల్పులు మొదలయ్యాయని అంతిమంగా ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చామని సైనిక అధికారులు తెలిపారు. పాకిస్తాన్ జాతీయుడైన దుజానాకు దక్షిణ కాశ్మీర్‌లో జరిగిన అనేక దాడులతో సంబంధం ఉందని అధికారులు తెలిపారు. దుజానా ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

చిత్రాలు.. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో కుప్పకూలిన ఓ భవనం... ఇన్‌సెట్‌లో మృతి చెందిన ఉగ్రవాది అబూ దుజానా