జాతీయ వార్తలు

ఆయనో ఊసరవెల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఆగస్టు 1: మాజీ మిత్రుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ నిప్పులు చెరిగారు. అధికార దాహంతో పార్టీలు మార్చే వ్యక్తి నితీశ్ అని దుయ్యబట్టారు. ‘నితీశ్ ఓ ఫాల్తూరామ్. అధికారం కోసం వేగంగా రంగులు మార్చే ఊసరవెల్లి లాంటివాడు. ఈ విషయంలో ఆయనకు నైతిక విలువలే లేవు’ అని మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ లాలూ అన్నారు. అధికారంకోసం నితీశ్ ఎన్నిసార్లు పార్టీలు మార్చారో లెక్కే లేదని కూడా అన్నారు. నితీశ్ తన సత్తా ఎంతో, తాను ఎక్కడినుంచి వచ్చానో మరిచిపోయారని, గతంలో ఆయన రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, ఒకసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారని అన్నారు. నితీశ్ ఎంతమాత్రం నమ్మదగ్గ వ్యక్తి కాదని, అందుకే ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను అంగీకరించలేదని, అయితే ములాయం సింగ్ నచ్చజెప్పడంతోఅంగీకరించాల్సి వచ్చిందన్నారు. బిజెపి శిబిరంలోకి మారడం కోసం నితీశ్ తన కుమారులను పావులుగా వాడుకున్నారని కూడా ఆయన ఆరోపించారు.
బిజెపిలోకి చేరడానికి కొద్దిరోజుల ముందు కూడా నితీశ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారని, ఇప్పుడేమో ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురులేని నాయకుడని పొగుడుతున్నారని లాలూ దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ హత్య కేసులో నిందితుడని గతంలో కూడా లాలూప్రసాద్ ఆరోపించడం తెలిసిందే.