జాతీయ వార్తలు
ప్రధానికి, అమిత్ షాకు గాజులు పంపనున్న మహిళా కాంగ్రెస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 August 2017
పనాజి, ఆగస్టు 6: గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారుపై దాడికి నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్షాలకు గాజులు పంపుతామని గోవా కాంగ్రెస్ మహిళా విభాగం తెలిపింది. వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఓదార్చడం కోసం వెళ్లిన వ్యక్తి కారుపై రాళ్లు రువ్వడం పిరికిపంద చర్య అని గోవా ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రతిమా కౌటిన్హో అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ఎవరైనా, ఎక్కడికయినా వెళ్లవచ్చని ఆమె అన్నారు. దేశంకోసం ప్రాణాలనే ఇచ్చిన కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ ఇలాంటి దాడులకు బెదరరనే విషయం బిజెపి నేతలు తెలుసుకోవాలని కౌటిన్హో అన్నారు.