జాతీయ వార్తలు

రజకులను ఎస్సీల్లో చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: తెలుగు రాష్ట్రాల్లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వైకాపా పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ వైవి సుబ్బారెడ్డి సమావేశమై తెలుగు రజకుల సమస్యలను, వారి స్థితిగతులను వివరిస్తూ వినతిపత్రాన్ని అందించారు. రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని కొనేళ్లుగా డిమాండ్ చేస్తున్నారని, న్యాయపరమైన వారి డిమాండ్‌ను కేంద్రం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సుబ్బారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయమై రాజ్‌నాథ్ సింగ్ సానుకులంగా స్పందించారని, సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు.