జాతీయ వార్తలు

దేశాభివృద్ధికి కలిసికట్టుగా కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశ స్వాతంత్య్ర సముపార్జనకు కృషిచేసిన నాటి మహనీయుల ఆశయ సాధనకు యువతరం పునరంకితం కావాలని ఆంధ్రా భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఉద్ఘాటించారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం ఆంధ్రాభవన్ ప్రాంగణంలో ప్రవీణ్ ప్రకాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మువ్వనె్నల జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మన ఆంధ్రుడు కావడం మనకెంతో గర్వకారణం అన్నారు. మహనీయుల అకుంటిత దీక్ష, దక్షతలతో సాధించుకున్న భారతావని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనని పిలుపునిచ్చారు. 17వ పోలీస్ బెటాలియన్ ఎఆర్‌ఎస్‌ఐ వి.రాజారెడ్డి పెరేడ్ ఇంచార్జ్‌గా వ్యవహరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం విద్యార్థులకు, ఆహూతులకు మిఠాయిలు పంపిణీ చేశారు.