జాతీయ వార్తలు
రాజీవ్కు ఘన నివాళులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఆగస్టు 20: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 73వ జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ సమాధి వీర్భూమి వద్ద ఆదివారం నిర్వహించిన కార్యమ్రానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, మాజీ స్పీకర్ మీరాకుమార్, ప్రియాంక గాంధీ తదితరులు హాజరై నివాళులర్పించారు. తెలంగాణ నుంచి మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్కొన్నారు. ఉగ్రవాదానికి, మతతత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తమిళనాడులో ప్రారంభించిన రాజీవ్ సద్భావన యాత్ర తొమ్మిది రాష్ట్రాల్లో పర్యటన అనంతరం ఢిల్లీ చేరుకుంది. యాత్ర జ్యోతిని రాజీవ్ ఘాట్ వద్ద ఉంచి ఉగ్రవాదానికి, మతతత్వానికి వ్యతిరేకంగా నేతల చేత సోనియా, రాహుల్ ప్రతిజ్ఞ చేయించారు.
చిత్రాలు...మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని వీర్భూమి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న
మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్,
లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ఆయన మేనకోడలు మిరయా వాద్రా తదితరులు