ఆంధ్రప్రదేశ్‌

ఉమ్మడి సంస్థల విభజనపై భేటీ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: తెలుగు రాష్ట్రాల వివాదాస్పదంగా ఉన్న ఉమ్మడి సంస్థల విభజన ప్రక్రియ చేపట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటి సమావేశం వాయిదా పడింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ నేతృతంలోని కమిటీ సోమవారం నాడు సమావేశం కావల్సి వుంది. కాని కొంతమంది అధికారులు గైర్హాజరు కావడంతో కమిటి సమావేశం వాయిదా వేశారు. తదుపరి సమావేశ వివరాల సమాచారాన్ని త్వరలో తెలియజేస్తామని హోంశాఖ అధికారులు ఆంధ్ర, తెలంగాణ అధికారులకు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల ఉన్నత అధికారులతో ఒక కమిటిని నియామకం చేసిన విషయం తెలిసిందే.