జాతీయ వార్తలు

అదో ‘ఎలక్షన్ ట్రైన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేసిన అహ్మదాబాద్-ముంబయి హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు గుప్పించింది. మోదీ చెబుతున్న హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ ‘ఎలక్షన్ బుల్లెట్ ట్రైన్’ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడ కొత్త పథకాలతో మోదీ మభ్యపెడుతుంటారని, అహ్మదాబాద్- ముంబయి హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు ఆ కోవకు చెందినదేనని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే దుయ్యబట్టారు.
రైళ్లు, ప్రయాణికుల భద్రత ఏమాత్రం పట్టని బిజెపి ప్రభుత్వం బుల్లెట్ రైళ్లంటూ జనాన్ని మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్‌పిఎన్ సింగ్ ఆరోపించారు.