జాతీయ వార్తలు

‘పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌ను మార్చేందుకు సిద్ధంగా లేమని కేంద్ర రోడ్డు రవాణా జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సోమవారం గడ్కరీ విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ను మారిస్తే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరుగుతుందని, ఆ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం సుముఖంగా లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. 2019 నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారని చెప్పారు. ఇటీవలే పోలవరం ప్రాజెక్టును తానూ సందర్శించి వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.