రాష్ట్రీయం

రాహుల్‌తో విజయశాంతి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా ప్రకటించారు. విజయశాంతి మంగళవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సామాన్య కార్యకర్తగా తన వంతు కృషి చేస్తానని విజయశాంతి చెప్పారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియంతృత్వ పరిపాలనతో విసిగి వేసారిపోయిన వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కుంతియా చెప్పారు.

చిత్రం..మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయన సినీనటి విజయశాంతి. చిత్రంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పిసిసి నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.