జాతీయ వార్తలు
జాతి నేత నెహ్రూ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 128వ జయంత్యుత్సవాలు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నెహ్రూ ఘనతను గుర్తు చేసుకుంటూ రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళి అల్పించారు. పండిన్ నెహ్రూ దేశానికి గొప్ప నాయకుడు అంటూ రాష్టప్రతి రామ్నాథ్ ట్వీట్ చేశారు. మనీలాలో జరుగుతోన్న ఇండో-ఆసియాన్ సదస్సుతో బిజీగావున్న ప్రధాని నరేంద్ర మోదీ, పండిట్ నెహ్రూని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. ‘జాతి నేతను ఎప్పటికీ మరువలేం’ అన్న ట్వీట్తో గుజరాత్ పర్యటనలోవున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీలు నివాళి ప్రకటించారు. ఢిల్లీ శాంతివనంలోని నెహ్రూ మెమోరియల్ను సందర్శించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నెహ్రూ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. పలువురు రాజకీయ, కాంగ్రెస్ నేతలు దేశానికి నెహ్రూ చేసిన సేవను స్మరించుకుంటూ ఘన నివాళి ప్రకటించారు.