జాతీయ వార్తలు

పర్యాటక ప్రాంతాల్లో ప్రొటోకాల్ ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో పడవ ప్రమాదాలు జరగకుండా ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్స్ కన్నన్‌తనమ్ గురువారం లేఖలు రాశారు. ఏపీలో పడవ ప్రమాదంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి- సామర్ధ్యానికి మించి పర్యాటకులను పడవలపై ఎక్కించకూడదని, లైఫ్ జాకెట్లు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని, లైసెన్సులు లేని పడవలను నిరోధించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కృష్ణా నదిలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ప్రధానికి లేఖ రాశారు.మృతుల కుంటుంబాలను అదుకునేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.