జాతీయ వార్తలు

ఉగ్రవాదుల కాల్పుల్లో ఎస్‌ఐ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 17: జమ్మూ కాశ్మీర్‌లోని హజ్రత్‌బల్ ప్రాంతంలో శుక్రవారం కారులో వెళుతున్న ముగ్గురు ఉగ్రవాదులు పోలీసు బృందంపై కాల్పులు జరపగా ఓ సబ్-ఇన్స్‌పెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు. శ్రీనగర్- గండేర్బల్ రహదారిపై జకుర క్రాసింగ్ వద్ద పోలీసు బృందంపై ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులు ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసు శాఖలో పనిచేస్తున్న సబ్-ఇన్స్‌పెక్టర్ ఇమ్రాన్ తక్ ఉగ్రవాదుల తూటాలకు అమరుడయ్యాడు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలను విస్తృతం చేశారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు సమీప ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.