జాతీయ వార్తలు

నేడు ‘ఇరిసెట్’ వజ్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ నెల 24వ తేదీ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. తార్నాకలోని ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్, టెలికమ్యూనికేషన్స్ (ఐఆర్‌ఈఎస్‌ఈటి)- ఇరిసెట్ సంస్థ వజ్రోత్సవాల ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఇరిసెట్‌కు సంబంధించిన ‘హెరిటేజ్’ గ్యాలరీని, స్టేటాఫ్ ఆర్ట్ జపాన్ సాంకేతిక విజ్ఞానం కలిగిన ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ ఎక్యుప్‌మెంట్‌ను ఆవిష్కరిస్తారు. ఈ వజ్రోత్సవాల్లో రైల్వే మంత్రితో పాటు రైల్వే బోర్డు డైరక్టర్ జనరల్ (సిగ్నల్ అండ్ టెలికం) అఖిల్ అగర్వాల్, దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ తదితరులు హాజరవుతారని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి.