జాతీయ వార్తలు

జనం చనిపోతుంటే వేడుకలెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు చనిపోతుంటే మరోవైపు రూ. వందల కోట్లు ఖర్చు చేసి వేడుకలు చేసుకుంటారా అని కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలపై మండిపడ్డారు. వడదెబ్బ, నిరుద్యోగ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతోంటే వేడుకలు చేసుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మూలంగానే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యిందని, అందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు దిగ్విజయ్ ట్వీట్ చేశారు. గడచిన రెండేళ్లలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమే లాభపడ్డారని, రాష్ట్రంలో రైతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.