జాతీయ వార్తలు

కనీస పింఛను రూ. 7,500 చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ‘ఈపీఎఫ్-95’ స్కీమ్ కింద పెన్షన్ మొత్తాన్ని కనిష్ఠంగా రూ.7,500కు పెంచాలని గురువారం దేశ రాజధానిలో వేలాదిమంది పెన్షనర్లు ప్రదర్శన జరిపారు. ‘ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ’ పరిధిలోకి వచ్చే వారికి ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ చెల్లిస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం భారీ ఎత్తున పెన్షనర్లు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం నుంచి జంతర్ మంతర్ వరకూ ప్రదర్శన జరిపినట్లు ‘అఖిల భారత ఈపీఎస్-95’ పెన్షనర్ల సంఘర్షణ సమితి తెలిపింది. తమ డిమాండ్లను తీర్చకపోతే జాతీయ స్థాయిలో ఆందోళన చేపడతామని సమితి జాతీయ కన్వీనర్ అశోక్ రౌత్ తెలిపారు.