జాతీయ వార్తలు

సమయానికే పూర్తి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: పోలవరం జాతీయ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌గడ్కరీ సోమవారం మీడియాకు వెల్లడించారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామన్నారు. తాను, సీఎం చంద్రబాబు కలిసి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం. లక్ష్య సాధనకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఈనెల 22న పోలవరం వెళ్తున్నామని, మొత్తం పరిస్థితిని సమీక్షించాక ఆవసరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ బిల్లు నిధులు విడుదల చేస్తున్నామని గడ్కరీ వెల్లడించారు.