జాతీయ వార్తలు
కృష్ణా ట్రిబ్యునల్ విచారణ నేటికి వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 December 2017
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: కృష్ణానదీ జలాలను ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ బుధవారానికి వాయిదాపడింది. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా ట్రిబ్యునల్ ముందు ఏపీ తరపు సాక్షిగా ఉన్న సాగునీటి రంగ నిపుణుడు కే.వీ.సుబ్బారావును తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామిన్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడంద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలిస్తోందికదా అని తెలంగాణ న్యాయవాది ప్రశ్నించగా- పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి తెలంగాణకు దక్కాల్సిన నీటిని తరలించుకుపోతున్నామన్న ఆరోపణల్లో వాస్త వం లేదని సుబ్బారావు సమాధానం ఇచ్చారు.