జాతీయ వార్తలు

అంబరాన్నంటిన సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ కేంద్రం నుంచి విజయాల ఇస్రోగా పేరు మార్మోగుతోంది. పిఎస్‌ఎల్‌వి-సి 40 రాకెట్ ద్వారా మరోసారి మన శాస్తవ్రేత్తలు చరిత్ర సృష్టించించారు. ఒకే రాకెట్ ద్వారా మళ్లీ 31ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఘనత మన శాస్తవ్రేత్తలకే దక్కింది. అత్యంత కీలకమైన స్వదేశీ వందో ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతం చేసింది. శ్రీహరికోట నుంచి శుక్రవారం ఉదయం 9:29గంటలకు ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి 40 రాకెట్ విజయవంతంగా తన పని పూర్తిచేసింది. గురువారం ఉదయం 5:29గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ మైనస్ 0కు చేరగానే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొదట కార్టోశాట్-2ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన వాహక నౌక అనంతరం మన దేశానికి చెందిన మరో రెండు ఉపగ్రహాలు, విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలన్నింటిని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేర్చింది. ఈ ప్రయోగ విజయంతో షార్ సంబరాలు అంబరాన్నంటాయి. అంతేకాకుండా ఇస్రో శాస్తవ్రేత్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇదే తరహా ప్రయోగాలు చేసేందుకు ఇస్రో సైతం సన్నాహాలు చేస్తోంది. మొదట బుడిబుడి అడుగులు వేసిన మన శాస్తవ్రేత్తలు దినదిన అలుపెరగని అధ్యయనంతో నేడు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రపంచ దేశాలకు దీటుగా ప్రయోగాలు చేపట్టే ఎత్తుకు ఎదిగారు. ఇందుకు కారణం శ్రీహరికోటలో ప్రయోగాలకు అనుకూలంగా ఉండటమే. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలైతే ఇస్రోకు చేతిలో పెట్టిన విద్యగా మారిపోయింది. ఈ ప్రయోగాల్లో వినూత్న పద్ధతిలో ప్రయోగాలు చేపట్టి విజయాలు సాధిస్తున్నారు. దేశ కీర్తిప్రతిష్టలు సైతం షార్‌తో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ నుండే విదేశాలు సైతం వారి ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో ఇస్రో వాణిజ్య పరంగా సాంకేతిక సిరులు కురుస్తోంది. అతి తక్కువ కాల వ్యవధిలోనే రాకెట్‌లు రూపకల్పన చేసి అగ్రదేశాలకు దీటుగా తక్కువ వ్యయంతో ప్రయోగాలు చేపట్టడం మరో విశేషం. ఈ ప్రయోగంలో ఇస్రో ఘనత సాధించడమే కాకుండా చరిత్ర సృష్టించడంతో ప్రపంచ దేశాలు సైతం ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా గమనించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్ ద్వారా 104 ఉప గ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఘనత ఇస్రో సొంతం చేసుకొంది. ఆ ప్రయోగంతో రోదసీ రంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యా దేశాల సరసన భారత్ చేరింది. 2013లో అమెరికా 29 ఉపగ్రహాలు, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఈ రికార్డును భారత్ బద్దలు కొట్టడమే కాకుండా సమీప కాలంలో ఎవరూ అందుకోని రికార్డుకు చేరుకొంది. ఈ దఫా మొత్తం 31 ఉపగ్రహాలు ప్రయోగించగా, వాటిలో 28 విదేశాలకు చెందినవి కావడం గమనార్హం. వాటిలో ప్రధామైనది కార్టోశాట్-2 సిరీస్‌లోని కీలకమైన ఉపగ్రహం. భారత్‌కు చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు రెండు కూడా ఇస్రోకు చెందినవి.