జాతీయ వార్తలు

ఢిల్లీలో గ్యాంగ్‌రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఓ 23 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి నడుస్తున్న కారులోనే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డ మరో దురాగతం వెలుగులోకి వచ్చింది. దేశంలో మహిళలకు భద్రత కల్పించేందుకు నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలుచేస్తున్నప్పటికీ ఈ ఘటన వెలుగుచూడటం, అదీ దేశ రాజధాని నగరంలోనే జరగడం దిగ్భ్రాంతిని రేకెత్తిస్తోంది. శనివారం తెల్లవారుజామున ఈ అత్యాచార ఘటన చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. నిజాముద్దీన్ ప్రాంతంలో ఓ తినుబండారాల దుకాణానికి తాను వెళ్లానని, ముగ్గురు వ్యక్తులు తనను వెంబడించి తమతో కారులో రావాలని బలవంతం చేశారని, అయితే తాను నిరాకరించడంతో బలవంతంగా తనను కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం జరిపారని
ఆ మహిళ ఫిర్యాదు చేసింది. దాదాపు రెండు గంటలపాటు ఆ కారు నడుస్తుండగానే తనపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వెల్లడించింది. అనంతరం సన్‌లైట్ కాలనీ సమీపంలోని ఓ ఫ్లైఓవర్ వద్ద తనను వదిలేసి వెళ్లారని తెలిపింది. ఈ ప్రాంతం ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఉండటం గమనార్హం. కాగా, బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే రేపిస్టుల్లో ఇద్దరిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు.