జాతీయ వార్తలు

సిక్కుల గాయాలపై కారం చల్లడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జిగా కమలనాథ్ నియమితుడు కావడంతో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆయన పాత్ర మరోసారి చర్చనీయాంశమయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కమలనాథ్‌పై దాడికి ఈ అంశాన్ని ఉపయోగించుకుంది. ఆప్ నాయకుడు, 1984 నాటి అల్లర్లలో బాధితుల పక్షాన వాదిస్తున్న న్యాయవాది హెచ్‌ఎస్ ఫూల్కా.. 1984 నవంబర్ ఒకటిన ఢిల్లీలోని రాకబ్ గంజ్ సాహిబ్ గురుద్వారాపై దాడి చేసిన గుంపులో కమలనాథ్ ఉన్నారని ఆనాటి అఫిడవిట్లను ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఈ దాడిలో ఇద్దరు సిక్కులు సజీవ దహనం అయ్యారు.