జాతీయ వార్తలు

మొహాలీలో ‘విరాట్’ పర్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీజ్‌లో ఉన్నది కోహ్లీ... ధోనీ!
టెన్షన్ పడాల్సిన అభిమానులు ఎప్పుడో రిలాక్సయిపోయారు!
ఆ జంట మీదున్న నమ్మకం అలాంటిది మరి!
ఊపు మీదున్న కోహ్లీ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు
8 బంతులు... 8 పరుగులు!
ఎనిమిదో బంతికి పరుగేమీ రాలేదు
అయితేనేం... ఏడో బంతికి మరో ఫోర్!
ఆరు బంతులు... నాలుగు పరుగులు
చివరి ఓవర్ తొలి బంతికి ధోనీ ఫోర్!
అంతే... ఖేల్ ఖతమ్!
ఆసీస్ ఇంటికి... సెమీస్‌కు భారత్.
టి-20 సెమీస్‌కు భారత్
కీలక మ్యాచ్‌లో ఆసీస్ బోల్తా
తనదైన రోజున భారత్ ఎలా చెలరేగిపోతుందో మొహాలీ మ్యాచ్ కళ్లకు కట్టింది. టాస్ ఓడిపోయి ఫీల్డింగ్ చేసినా చేజింగ్‌లో, అదీ టి-20 మ్యాచ్‌లో భారత్‌కు తిరుగు లేదని మరోసారి రుజువైంది. 161 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు ఉండగానే భారత్ అధిగమించి, సెమీస్‌లోకి దూసుకుపోయింది. ఎప్పట్లానే ఓపెనర్లు ఫెయిలైనా, 51 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లీ కీలక ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించింది. యువరాజ్ సింగ్, కెప్టెన్ ధోనీలు అతనికి కొండంత అండగా నిలిచారు.

చిత్రం 51 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ