జాతీయ వార్తలు

మా బంధం తెగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 24: రాజ్యసభ ఎన్నికల్లో పరాజయం సమాజ్‌వాది పార్టీతో తన సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఈ రెండు పార్టీలు మరింత కలసికట్టుగా పనిచేసి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాయని ఆమె స్పష్టం చేశారు. సమాజ్‌వాది పార్టీ నుంచి మద్దతు లభించినా రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంపై స్పందించిన మాయావతి బీజేపీ విజయాన్ని అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. ఈ పరాజయంతో తాను సమాజ్‌వాది పార్టీకి దూరం అవుతానని బీజేపీ భావించిందని పేర్కొన్న మాయావతి ‘అలాంటి నిర్ణయానికి ఎలాంటి ఆస్కారం లేదు. సమాజ్‌వాది పార్టీతో మరింత సంఘటితంగా పనిచేసి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని పరాజయంపాలు చేస్తాం’అని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సమాజ్‌వాది పార్టీతో తాము కుదుర్చుకున్న రాజకీయ అవగాహన కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని అధికారంలోకి రానిచ్చేది లేదని మాయావతి తెలిపారు.