జాతీయ వార్తలు

జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ నేత కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 25: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బుధవారం మిలిటెంట్లు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ నాయకుడు ఒకరు మరణించగా, ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా దళాలు ఆ ప్రాం తానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. పుల్వామా జిల్లాలోని రాజ్‌పోరా చౌక్ వద్ద మిలిటెంట్లు కాల్పులకు తెగబడడంతో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిలో షాదీమార్గ్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గులామ్ నబీ పటేల్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే జి.ఎన్.పటేల్ మరణించారని తెలిపారు. మరణించిన పటేల్ కుటుంబానికి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర సంతాపం తెలిపారు. ఇలాంటి చర్యలవల్ల మిలిటెంట్లు ఏమీ సాధించలేరని, వారి అనాగరిక చర్యవల్ల ఓ కుటుంబం దిక్కులేనిది అయిందని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. గాయపడిన మిగతా ఇద్దరు పోలీసుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.