జాతీయ వార్తలు

గట్టెక్కడం కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: కర్నాటక అసెంబ్లీలో బీజేపీ బలపరీక్షకు సుప్రీం కోర్టు ఆదేశించటం చారిత్రాత్మకమని జెడీ(ఎస్), సీపీఐ నేతలు వ్యాఖ్యానించారు. నేడు జరగబోయే బలపరీక్షలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించే అవకాశం లేదని జోస్యం చెప్పారు. జేడీ(ఎస్)నేత దానిష్ అలీ మీడియాతో మాట్లాడుతూ 24 గంటల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యెడ్యూరప్ప, నేటితో దిగిపోతారని జోస్యం చెప్పారు. ఎవరి ఎమ్మెల్యేలు వారి దగ్గరే భద్రంగా ఉన్నారని, తొలి రోజునుంచే జేడీ(ఎస్), కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాయన్నారు. బీజేపీకి మెజారిటీ లేదు కనుక బలపరీక్షలో ఓటమి ఖాయన్నారు. సీపీఐ నేత డి రాజా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ బలనిరూపణకు పదిహేను రోజుల గడువిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై దేశం మొత్తం భగ్గుమంది. మెజారిటీ నిరూపించుకోవడానికి బీజేపీకి బలం లేదు. సభలో ఏం జరుగుతుందో చూడాలి’ అన్నారు.