జాతీయ వార్తలు
సీన్లోకి ఊమన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూన్ 27: తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా కేరళ మాజీ సిఎం ఊమన్ చాందీని నియమించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ యోచిస్తున్నట్టు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తుత ఇన్చార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ను త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి. దిగ్విజయ్ను తప్పించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్కు చెందిన పలువురు సీనియర్, జూనియర్లు చాలాకాలంగా సోనియా, రాహుల్ను కోరుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ పార్టీ సీనియర్, ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి సోమవారం కూడా సోనియాను కలిసి దిగ్విజయ్ని తప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రలో కాంగ్రెస్ దెబ్బతినడానికి ఆయనే కారణమని వివరించారు. తెలంగాణ సిఎల్పీ నేతగా కె జానారెడ్డిని సైతం తప్పించాలని గోవర్దన్ రెడ్డి హైకమాండ్ను కోరినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే జానారెడ్డి చేత సిఎల్పీ నాయకత్వ పదవికి రాజీనామా చేయిస్తుందనే మాట వినిపిస్తోంది. ఇదిలావుంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, కేరళ మాజీ సిఎం ఏకె ఆంటోని ఇప్పటికే రెండు మూడుసార్లు ఊమెన్ చాందీతో తెలంగాణ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టటం గురించి చర్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఊమెన్ చాందీ పచ్చజెండా ఊపగానే ఆయనను తెలంగాణ ఇన్చార్జిగా నియమిస్తూ ప్రకటన జారీ అవుతుందని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి.