జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఇద్దరు మిలిటెంట్ల హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 10: జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టాయి. మంగళవారం ఉదయం భద్రతాదళాలు, మిలిటెంట్ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక జవాన్ గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు. కుందుల్లాన్ గ్రామంలో జరిగిన ఘర్షణల్లో ముగురు పౌరులు గాయపడ్డారు. మిలిటెంట్ల సమాచారం అందుకున్న భద్రతాదళాలు ఉదయం తనిఖీలు నిర్వహిస్తుండగా అవతలి వైపునుంచి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు జరిగాయని పోలీసు ప్రతినిధి వెల్లడించారు. కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడని అన్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఎదురుకాల్పుల సమాచారం అందుకున్న స్థానికులు ఆ ప్రాంతానికి భారీగా చేరుకుని భద్రతాదళాలపై రాళ్ల దాడికి దిగారు. భద్రతాదళాలు గుంపులను చెదరగొట్టడానికి ప్రయత్నించగా ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఓ జవాను రాళ్లదెబ్బలకు గాయపడ్డాడని అధికారులు తెలిపారు.