జాతీయ వార్తలు

మాక్ డ్రిల్‌లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూర్/చెన్నై, జూలై 13: తమిళనాడులోని ఓ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. విపత్తులను ఎదుర్కొనేందుకు నిర్వహించిన డ్రిల్ ఓ విద్యార్థినిని బలితీసుకుంది. సంఘటనకు సంబంధించి శిక్షకుడు అర్మూగంను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి దీనిపై విచారణకు ఆదేశించారు. నిర్వాహకులు, ఉన్నత విద్యాశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విద్యార్థిని కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు.
చెన్నైలోని కొళైమగళ్ కాలేజీలో లోకేశ్వరి(19) అనే బీబీఏ సెంకడియర్ విద్యార్థిని డిజాస్టర్ డ్రిల్ కోసం భవనం రెండో అంతస్తుకు చేరుకుంది. అయితే కిందకి దూకడానికి ఆమె భయపడుతుండగా ట్రైనర్ అమాంతం ఆమెను కిందకి తోసేశాడు. దీంతో లోకేశ్వరి మొదటి అంతస్తు సన్‌షేడ్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడింది. తలకు తీవ్రమైన గాయమైన ఆమెను ప్రభుత్వం ఆసుపత్రికి తరలించగా చనిపోయింది.