జాతీయ వార్తలు

విపక్షాలకు మోదీ ఫోబియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి, సెప్టెంబర్ 24: కాంగ్రెస్ సహా దేశంలోని విపక్షాలన్నింటికీ మోదీ ఫోబియా పట్టుకుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ జరిగిన మహిళల సభలో మాట్లాడుతూ విపక్షాలకు అభివృద్ధిపై ఎలాంటి అజెండా లేదని, మోదీని విమర్శించడమే వారి పని అని అన్నారు. ఒకవైపు ఎన్డీఏ కూటమి దేశాన్ని మొదటి స్థానంలో నిలబెట్టాలని తపన పడుతూ ముందుకుపోతుంటే విపక్షాలు మాత్రం ఎలాంటి అజెండా లేకుండా కాలక్షేపం చేస్తున్నాయని అన్నారు. సహజ ఖనిజ వనరులు ఉన్న ఒడిసా ఇంకా పేదరికంతో వెనుకబడి ఉండటానికి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే 2019 ఎన్నికల్లో ఆయన ప్రభుత్వాన్ని గద్దె దించడమే మార్గమని అన్నారు. ఒక పక్క ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియాగా తీర్చిదిద్దుదామనుకుంటే కాంగ్రెస్, ఇతర విపక్షాలు మాత్రం దానిని బ్రేకింగ్ ఇండియాగా మారుస్తున్నారని అన్నారు.