జాతీయ వార్తలు

శబరిమలను రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 15: కేరళలో ‘సేవ్ శబరిమల’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. శబరిమల ఆలయంలోని మహిళకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా అన్ని వయసుల మహిళలూ సోమవారం రోడ్లపైకి వచ్చి నినదించారు. బీజేపీ నాయకత్వంలో రాజధాని తిరువనంతపురంలో భారీ ర్యాలీ జరిగింది. రోజురోజుకూ ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతరూపం దాలుస్తున్నాయి. కాగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వివిధ వర్గాలతో మంగళవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయప్ప ఆలయ తంత్రీ(ప్రధాన పూజారి) కుటుంబం, పండాలం రాయల్స్, అయ్యప్ప సేవాసంఘం సమావేశానికి హాజరవుతుంది. నవంబర్ 17 నుంచి జరిగే మండలం మకరవిలక్కు వార్షిక ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనితోపాటు మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. నెలవారీ పూజల నిమిత్తం బుధవారం ఆలయాన్ని తెరుస్తారు.
ఇలా ఉండగా తిరువనంతపురంలోని రాష్ట్ర సచివాలయం ఎదుట బీజేపీ నాయకత్వంలోమహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. అన్ని వయస్సుల మహిళలూ ఈ ఆందోళన కార్యాక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప మంత్రాలు జపిస్తూ, ఆయన చిత్రపటాలకు పూల మాలలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోపక్క సుప్రీం తీర్పును అమలుచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన మారథాన్ కొనసాగుతోంది. అయ్యప్ప భక్తుల విశ్వాసాలను కాపాడాలని, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాదయాత్ర సాగుతోంది. లక్షలాది ప్రజల మనోభవాలను కాదని, కోర్టు తీర్పును అమలుచేయాలన్న వాపమక్ష ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన భక్తులు మూడు నెలలపాటు జరిగే అయ్యప్ప పూజలకు హాజరవుతుంటారని బీజేపీ ఎంపీ సురేష్ గోపీ అన్నారు. సోమవారం నాటి ర్యాలీకి భారతీయ ధర్మ జనసేన చీఫ్ తుషార్ వెల్లప్పల్లె, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై నాయకత్వం వహించారు. ప్రజల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పిళ్లై ఆరోపించారు. ‘రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి వెళ్తాం. ఇంటింటినీ దర్శిస్తాం. మా ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరతాం. అయ్యప్ప స్వామి ఆలయం పవిత్రను కాపాడేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములు కావాలని అభ్యర్థిస్తా’అని ఆయన వెల్లడించారు. 24 గంటల్లో సమస్యకు పరిష్కారం చూడకపోతే ఎన్‌డీఏ భాగస్వామ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన వెల్లడించారు. మరోపక్క నెలవారీ పూజలు ‘తులం’ నిమిత్తం శబరిమల ఆలయాన్ని ఈనెల 17న తెరుస్తారు. ఐదురోజుల పాటు పూజలు నిర్వహించిన తరువాత 22న మూసివేస్తారు. శబరిమల ఉద్యం తారస్థాయికి చేరుకోవడంతో రాజధానిలోభద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. బీజేపీ పాదయాత్ర జరిగే మార్గంలోనూ బందోబస్తు పెంచారు. సెప్టెంబర్ 28న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆలయ ప్రవేశానికి అనుకూలంగా తీర్పును వెలువరించినప్పటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

చిత్రం..సోమవారం తిరువనంతపురంలో జరిగిన సేవ్ శబరిమల ఉద్యమానికి భారీగా తరలివచ్చిన జనం