జాతీయ వార్తలు

మిజోరంలో హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంలో నవంబర్ నెలలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌కు. నార్త్ ఈస్ట్ డెవలప్‌మెంట్ అలయెన్స్ మధ్య పోటీ హోరా హోరీగా జరగనుంది. ఈ కూటమిలో బలమైన ప్రతిపక్ష పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ చేరింది. ఈ కూటమిని బీజేపీ ఏర్పాటు చేసింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో మిజోరం ఒకటి. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన లాల్ తాన్హావ్లా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ నార్త్ ఈస్ట్ డెవలప్‌మెంట్ అలయెన్స్ (ఎన్‌ఈడీఏ) కూటమిని ఏర్పాటు చేసింది. 1972 వరకు అసోంలో భాగంగా మిజోరం ఉండేది. అనంతరం మిజోరాంను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1987లో 53వ రాజ్యాంగ సవరణ ద్వారా 23వ రాష్ట్రంగా మిజోరంఅవతరించింది. మిజోరం జనాభా 10.91 లక్షలు. ఇక్కడ 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 21,087 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న ఈ రాష్ట్రంలో 91 శాతం అడవులు ఉన్నాయి. బంగ్లాదేశ్, మియాన్మార్‌తో 722 చ.కిమీ సరిహద్దును కలిగి ఉంది. మిజోరం రాజధాని పేరు అజ్వాల్. ఈ రాష్ట్రంలో 87 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. 20 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువున ఉన్నారు. మిజోరం పేరుకు చిన్న రాష్టమ్రైనా రాజకీయ చైతన్యం ఎక్కువ. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన హోంశాఖ మంత్రి లాల్జీర్‌లైనా ఇటీవల ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ప్రతిపక్ష పార్టీ మిజోనేషనల్ ఫ్రంట్‌లో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరాంలో మినహా మిగతా చోట్ల బీజేపీ పాగా వేసింది. ఈ సారి ఏ విధంగానైనా ఇక్కడ గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ ఉలీళ్లూరుతోంది. అభివృద్ధి అజెండాగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది.
మిజో నేషనల్ ఫ్రంట్ నేతృత్వంలో బీజేపీ ఎన్‌ఈడీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లుపరుగెత్తుతున్నాయి. పైగా అధికార పార్టీకి చెందిన నేత లాల్జీర్‌లైనా ఈ కూటమిలోకి రావడంతో విపక్ష పార్టీల్లో ఉత్సాహంగా ఉన్నాయ. పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. గత ఏడాది రెండు సార్లు ప్రధాని నరేంద్రమోదీ పర్యటించారు. మిజోరం తొలి ముఖ్యమంత్రిగా మిజో యూనియన్ నుంచి చౌంగా 1972లో ఎన్నికటయ్యారు. ఆ తర్వాత మిజో పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి 1978లో, 1979 ఎన్నికల్లో ఎన్నికైన టీ సైలో 1984 వరకు ఆ పదవిలోన్నారు. 1984లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో లాల్ తాన్హావ్లా ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు. 1986లో మిజో నేషనల్ ఫ్రంట్ తరఫున లాల్ డెంగా ఎన్నికై ఆ పదవిలో 1988 వరకు కొనసాగారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. లాల్ తాన్హావ్లా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1998 ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ గెలిచింది. జోరాంతంగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2008 ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ ఓటమి చెందింది. 2008, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గడంతో లాల్ తాన్హావ్లా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.