జాతీయ వార్తలు

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి టౌన్/ ముదిగుబ్బ, జూలై 23: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. టవేరా వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. కర్నాటకకు చెందిన వీరంతా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తూ మృత్యువాత పడ్డారు. కర్ణాటక రాష్ట్రం దొడ్డ బళ్ళాపూర్ తాలూకా నెల మంగళ గ్రామానికి చెందిన రామయ్య తన కుటుంబసభ్యులు, బంధువులు 11 మంది కలిసి టవేరా వాహనంలో తిరుమలకు బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం సంకేపల్లి క్రాస్ వద్దకు రాగానే కదిరి నుంచి అనంతపురం వెళ్తున్న లారీ ఢీ కొంది. ప్రమాదం తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జయింది. మృతుల్లో కృత్తిక (3), శైలజ (33), నందీశ్ (18), కావ్య (20),డ్రైవర్ మంజునాథ్ (30) ఉన్నారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం బెంగళూరు తరలించారు.

చిత్రం..లారీ ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన టవేరా వాహనం. వాహనంలో చిక్కుకున్న మృతదేహాలు